తానా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
తానా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సంధర్భంగా, ఫిబ్రవరి 21న తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన 'తల్లి భాష తెలుగు మన శ్వాస' అనే అంతర్జాల కార్యక్రమంలో ప్రసంగించిన భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు.
తెలుగు సాహితీ వైభవాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుదాం- ఉపరాష్ట్రపతి విదేశాల్లో ఉన్న తెలుగువారు, మన సాహిత్యాన్ని ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదించే ప్రయత్నం చేయాలి. తెలుగు కావ్యాల గురించి ఈతరం పిల్లలకు అవగాహన పెరిగే విధంగా పుస్తకాలు రావాలి భాషను సాంకేతికతతో అనుసంధానం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. తెలుగు భాష, సంస్కృతులను భావి ప్రవాసాంధ్రులకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయం.

తెలుగు సాహితీవైభవాన్ని, సంస్కృతిని ప్రపంచ వేదిక పై ఘనంగా చాటేందుకు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచభాషల్లోకి అనువదించే ప్రయత్నం చేయాలని వివిధ దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపు నిచ్చారు. ఏ భాషైనా విశ్వవ్యాపితం కావడానికి పరి పుష్టి చెందడానికి అనువాదాలు ఎంతో అవసరమన్న ఆయన, ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదం అయినంతగా, మన తెలుగు సాహిత్యం ఇతర భాషల్లోకి అనువాదం కావడంలేదని, ఈ విషయంలో ప్రభుత్వాలతో పాటు, తెలుగువారంతా దొరవ తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.
గత 44 సంవత్సరాలుగా ఉత్తర అమెరికాలో తెలుగుభాష సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణ కోసం పాటుపడుతూ, వాటిని ప్రవాసాంధ్ర భావితరానికి అందించే క్రమంలో ఆహరహం కృషి చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘానికి, తానా ప్రపంచ సాహితీ వేదిక ద్వారా ప్రతినెలా వినూత్న కార్యక్రమాలు నిర్వ హిస్తున్న, సాహిత్యవేదిక నిర్వాహకులు, తానా పూర్వా ధ్యక్షులు డా|| తోటకూర ప్రసాద్కు అభినందనలు తెలిపారు.
విశ్వంలోని విభిన్న సంస్కృతుల వైవిధ్యాన్ని, మాతృభాషల వైభవాన్ని ఘనంగా చాటుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి 'అంతర్జాతీయ మాతృభాషా దినో త్సవం'గా ప్రకటించిందన్న ఉపరాష్ట్రపతి. ఎన్నో భాషలు అంతరించే దశలో ఉన్నాయని, ప్రస్తుతం చాలామంది తెలుగువారు తమ భాషను మాట్లాడలేక పోతున్నారని, ఈ నేపథ్యంలో 30 ఏళ్ల తర్వాత భాష పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే ఆందోళన కలుగుతోందని తెలిపారు. ఈ పరిస్థితి మారాలంటే మొదట ప్రాథమిక విద్యాభ్యాసం, పరిపాలన భాష, న్యాయ స్థానాల భాష, శాస్త్ర సాంకేతిక విద్య మాతృభాషలోకి మారాలని, అన్నింటికీ మించి కుటుంబసభ్యులతో మాతృభాషలో మాట్లాడుకోవాలని సూచించారు. మొదటి మార్పు ప్రజలతో మొదలుకావాలని ఆకాంక్షించారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందే క్రమం లో, మనకు తెలియకుండానే మనం చేస్తున్న పాఠ పాటు మాతృభాషను విస్మరించడమన్న ఉపరాష్ట్రపతి, భాషా పరిరక్షణ, భాషా వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న తెలుగు వారు, తెలుగు సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసేం దుకు నడుం బిగించాలని సూచించారు. తెలుగు వారికి పద్యం, సామెతలు వంటి విశేషమైన భాషా సంపద ఉందని, తెలుగు పంచ మహాకావ్యాలను ముందు తరాలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో అందించాలని సూచించారు.
ప్రస్తుతం ప్రపంచమంతా అంతర్జాలంతో కలిసి పరిగెడుతోందన్న ఉపరాష్ట్రపతి, భాషను, సాంకేతికత తో అనుసంధానించే ప్రయత్నాలు మరింత ముమ్మరం చేయాలని, ఈ దిశగా భాషావేత్తలు, భాషాభిమానులు, సాంకేతిక నిపుణులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లో తెలుగుభాష వాడకం, లిపి సృష్టి లాంటి విషయాల్లో చెప్పుకోదగిన కృషి జరిగిందని, ఈ మార్గంలో మరిన్ని వినూత్న ఆవిష్కరణల దిశగా సాగాలని సూచించారు. ఈ కార్య క్రమంలో తానా పూర్వ అధ్యక్షులు డా|| ప్రసాద్ తోటకూర, తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్, ప్రసిద్ధ కవి డా॥అద్దంకి శ్రీనివాస్, అవధాని గన్నవరం లలిత ఆదిత్య, గుమ్మడి గోపాలకృష్ణ, కడప స్వాతి, విష్ణుభట్ల కార్తీక్, అద్దంకి వనీజతో పాటు పలువురు భాషాభిమానులు పాల్గొన్నారు.
ఈ క్రింది పేర్కొన్న అతిధులు వివిధ అంశాలపై ప్రసంగించారు.
డా. ఈమని శివనాగిరెడ్డి స్థపతి, చరిత్ర పరిశో ధకులు, బహుగ్రంధ రచయిత, విజయవాడ కల్చరల్ సెంటర్ కార్యనిర్వహణాధికారి- 'తెలుగుభాష పరి ణామక్రమం శిలాశాసనాల సాక్షిగా' అనే అంశం పై. ఆచార్య శ్రీ గణేష్ తొట్టెంపూడి భాషాశాస్త్ర, సాంకేతిక నిపుణులు, ఎస్.ఆర్.హెచ్ విశ్వవిద్యాలయం, జర్మనీ-'జర్మనీ దేశంలో ప్రజలు వారి మాతృభాషకిచ్చే ప్రాధాన్యత' అనే అంశంపై, డా. అద్దంకి శ్రీనివాస్, ప్రసిద్ధ కవి, రచయిత, రాష్ట్రపతి పురస్కార గ్రహీత-'తెలుగు సాహిత్యం దశ-దిశ' అనే అంశంపై, ప్రవా సాంధ్ర యువ అవధాని గన్నవరం లలిత ఆదిత్య-తెలుగుభాష నేర్చుకోవలసిన ఆవశ్యకత అనే అంశాల పై ప్రసంగించారు.
ఈ క్రింది పేర్కొన్న భాషాభిమాన గాయనీ గాయకులు తెలుగుభాషా వైభవంపై పద్యాలు, పాటలు పాడి అందరినీ అలరించారు.
సున్నపురాళ్ల సాయి కిరణ్ (అనంతపురం), షేక్ షహీద్ (ఆదిలాబాద్), విష్ణుభట్ల ప్రహర్షిత, (హైదరా బాద్), ఏలూరు యంగన్న కవి (అనంతష్టార్థం). సూకతోటి శరత్బాబు (ఒంగోలు), బి.టి. నాగేంద్ర (అనంతపురం), చంద్రా నాయక్ (విజయవాడ), బండ వెంకన్న (మహబూబాబాద్), కుంచెపు అంజి (అనంత పురం), కృషిత నందమూరి (పెన్సిల్వే నియా), ధీరజ్ యలమంచి (పెన్సిల్వేనియా), శ్రీ జరుగుల (న్యూ బెర్సీ), పాలవలస రఘు (విజయనగరం), బి. యశోద (పార్వతీపురం), రామమనోజ్ కుమార్ (విజయనగరం).
ఈ కార్యక్రమం మొత్తాన్ని అత్యంత ఆసక్తి దాయకంగా నిర్వహించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా॥ ప్రసాద్ తోటకూర ఈ సభను విజయవంతం చేయడంలో తోడ్పడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.