తనను తాను తిట్టుకున్నట్టుగా ఎవరూ తనని తిట్టలేరనీ, తనని తాను మెచ్చుకున్నట్టుగా ఎవరూ తనని మెచ్చుకోలేరనీ చెపుతూ, మనిషిగా ఎదగాలంటే ఎవరిని వారే విమర్శించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని చెప్పే శాస్త్రిగారు నిరంతరం చేసే పని అదే.
తనలోని కవిని తాత్వికుడూ, ఆ తాత్వికుణ్ని మనిషీ డామినేట్ చేస్తాడని చెప్తూ మనిషితనానికే పెద్దపీట వేసే సిరివెన్నెల వ్యక్తిగా ఎంత ఉన్నతులో ఆయన్నెరిగిన వారందరికీ తెలిసిన విషయమే.
వెన్నెలంటే ఎవరికిష్టం ఉండదు? దానికి సిరి కూడా తోడైతే ఆ వైభోగమే వేరు. ఆయనదెంత సిరిగల సాహిత్యం కాకపోతే ప్రతి కవీ కలవరించే, భావుకుడైన ప్రతివ్యక్తీ పలవరించే వెన్నెలనే తన పేరుగా పొందుతారు! తను గీత రచయితగా పనిచేసిన మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల ఆ తరువాత ముప్ఫయ్యేళ్లకే మరో పది నందులు గెల్చుకున్నారు. గొప్ప పాటల్ని రాయడమే కాదు వాటిలో వ్యక్తమైన జీవన తాత్వికతనీ, ఔదార్యాన్నీ, సానుకూల దృక్పథాన్నీ, వ్యక్తిత్వ వికాసాన్నీ ఆచరణలో కూడా చూపించే అచ్చమైన కవి శాస్త్రిగారు.
కవి రాతతో పాటు పాటకి దాని సొంత తలరాత కూడా ఉంటుందనీ, ఆ పాట వీధినపడ్డ తరువాతే దాని బతుకేవిటో తెలుస్తుందనీ అంటారాయన. ఏ సన్నివేశానికయినా ఏ సినిమాలోనయినా తన గుండెలోతుల్లోంచి ఉబికి వచ్చే భావధార ఆధారంగానే పాటలు రాసే అరుదైన రచయితల్లో సీతారామ శాస్త్రి గారొకరు. లలితమైన సినీగీతాలకి కావ్యగౌరవం తెచ్చిన గీత రచయితల్లో ఆయనది ప్రథమ శ్రేణి. కవి రాసిన సాహిత్యానికి సంగీతం తోడైతే పాటవు తుంది. దానికి దృశ్యం జతై ప్రేక్షకుడికి అందుతుంది. ఫొటోగ్రఫీ రంగం ఎంతో ప్రగతి సాధించిన ఈ రోజుల్లో సాహిత్యం పెద్ద గొప్పగా లేకపోయినా సంగీతం, చిత్రీకరణ అద్భుతంగా కుదిరినపుడు సినిమాలో ఆ పాటలు మనని ఎంతగానో ఆకట్టుకుంటాయి. కానీ సినిమా లేకపోయినా కేవలం గీతంగా కూడా స్వయం పరిపుష్టత గల పాటలు కొన్నే ఉంటాయి. శాస్త్రిగారి పాటలు అలాంటివి.
సన్నివేశానికి కూర్చిన సంగీతానికి తగినట్టుగా పాటని రాసేటపుడు కూడా సందర్భాన్ని బట్టి లలిత లలిత పదగుచ్చాలనూ, గంభీర శబ్ద సమూహాలనూ అందమైన నగలో రత్నమాణిక్యాలను శ్రద్ధగా అమర్చినట్టుగా పాటని తీర్చి దిద్దడం ఆయనకలవాటు.
మేం బెంగుళూరులో కొత్తగా కాపురం పెట్టిన రోజులవి. ఎప్పుడు రేడియో పెట్టినా సిరివెన్నెల చిత్రగీతాలు వినిపిస్తూనే ఉండేవి. అయినా చాలదన్నట్టు శర్మగారు ఆ సినిమా గీతాలున్న కాసెట్ కొని తెచ్చారు. విరించినై విరచించితినీ ఈ కవనం- విపంచినై వినిపించితినీ ఈ గీతం... పాట మొదటిసారి వినిపించగానే అంతవరకూ సంగీతం మీదే ఎక్కువగా ఆధారపడి మనగలిగే సినిమా పాటల మధ్య ఈ పాట విభిన్నంగా, పరిమళ భరితంగా తోచింది. వింటున్నకొద్దీ మధురంగా అనిపించడం, విన్న వెంటనే అర్థంకాని సాహిత్యపు సాగసులు వినగా వినగా అవగతమవడం, సాహిత్యాన్ని అర్థం చేసుకుని వినడం వల్ల మరింత మనోహరంగా తోచడంతో ఈ రచయిత ఎవరా అని పేరు తెలుసుకుని అప్పట్లోనే ఆయన పట్ల అభిమానం పెంచు కున్నాం ఇద్దరం. ఆ పాటకి ఆ సంవత్సరం (1986) గీత రచయిత గా సీతారామశాస్త్రిగారు నంది పురస్కారం అందుకున్నారని తెలిసి సంతోషించాం.
ఇక్కడ నా నేపథ్యం గురించి కొంచెం చెప్పాలి. చుట్టూ పాలాలు మధ్యలో మా ఒంటరి ఇల్లూ, కొద్దిమంది కూలీలని వెంట పెట్టుకుని నాన్నగారు స్వయంగా తోటలోని రాళ్లతో కట్టిన ఇల్లు మాది. వందెకరాల అడవిని పంట పొలంగా మార్చే క్రమంలో వనవాసిగా మారిన నాన్నగారు. ఆయన వెనకే అమ్మా. మామ్మా, తాతగారూ, మేం నలుగురు పిల్లలం. ఏడాదికొకసారి సెలవు లివ్వగానే బంధుమిత్రుల పిల్లలందరూ చిలక గుంపులా ఒక్క సారిగా వచ్చి వాలిపోయే ఫలవృక్షం మా తోట..
పంతొమ్మిదేళ్లు ఇరుగూ పొరుగూ అన్న మాటకి అర్థమే తెలియకుండా పెరిగి ఒక్కసారిగా భాగ్యనగరంలో ఎమ్మెస్సీ చదువుకి వచ్చిన నా పరిస్థితి నీటి కొలనులోంచి గట్టుమీద పడ్డ చేపపిల్లలా అయింది. తర్వాత కిద్వాయ్ కాన్సర్ ఆసుపత్రిలో వైద్యుడైన శర్మగారితో వివాహం, బెంగుళూరులో కొత్త కాపురం. అందరిలాగే ఆ తర్వాత కొన్నాళ్లకి కొత్త జీవితం అలవాటైంది. అప్పట్లో బాలకృష్ణప్రసాద్ గారి మధురకండంలో అన్నమయ్య కృతులు కాసెట్గా లభించేవి. చక్కని తల్లికి చాంగుభళా, పలుకు తేనెల తల్లి పవళించెనూ... మొదలైన కృతులు వింటూ ఒకరోజు కొత్తగా తెలవారదేమో స్వామీ... పాట విన్నాను. అన్నమయ్య కృతినే సినిమాలోకి తీసుకున్నారేమో అనుకున్న నాకు తర్వాత తెలిసింది అది శృతిలయలు సినిమాలో సీతారామశాస్త్రిగారు రాసిన పాట అని, సర్వాంగ సుందరమైన ఆ సినిమాలోని ఈ పాటకి ఆ సంవ త్సరం (1987) నంది అవార్డ్ లభించింది. వరసగా రెండు సంవత్స రాలు ఒక కొత్త రచయిత పాటలకి ఈ పురస్కారం లభించడం అబ్బురంగా తోచింది. అదే రచయిత రాబోయే కాలంలో ఎన్నో రికార్డులు నెలకొల్పుతారనీ, తన రికార్డులు తానే తిరగరాస్తారనీ అప్పుడు తెలియదుగా.
ఆ తర్వాతి సంవత్సరం స్వర్ణకమలం సినిమా వచ్చింది. అందమైన తారాగణంతో, ప్రతిభావంతుడైన దర్శకుడి సారధ్యం లో యువ హృదయాలను గిలిగింతలు పెట్టేలా, మన సంప్రదాయ కళల పట్ల మక్కువ కలిగేలా తీసిన ఆ ప్రేమకథా కళాచిత్రంలోని పాటల్లో సంగీతమూ, సాహిత్యం ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడగా శోభలీనే సోయగాల భానుప్రియ నాట్యం ప్రేక్షకులకి చిరకాలం గుర్తుండిపోయేలా రూపుదిద్దుకుంది.
ఈ సినిమాలో మీనాక్షి ఆశలకీ, ఆమెని అమితంగా ఇష్ట పడుతున్న చంద్రం ఆశయాలకీ- నింగికీ నేలకీ ఉన్నంత దూరం. తండ్రి నేర్పిన నృత్యంపట్ల ఆసక్తిగానీ, అభిమానంగానీ లేని మీనాక్షిని ఎలాగైనా అనునయించి ఆమెలో కళపట్ల అంకిత భావం మొలకెత్తించాలని చంద్రం ప్రయత్నం. ఈ రెండు పాత్రల మధ్య సంఘర్షణని ప్రతిబింబిస్తూ వారి మధ్యనున్న భావ వైరుధ్యాలకి అద్దం పడుతూ రాయాల్సిన మూడు పాటలు రచయిత ప్రతిభకి ఒక సవాలుగా చెప్పుకోవచ్చు. ఒక రచయితగా ఈ సందర్భంలో తానెదుర్కొన్న క్లిష్టతని శాస్త్రిగారే స్వయంగా వివరించారు.
మూడు పాటలూ ఈ రెండు పాత్రల మధ్యే చిత్రీకరించ బడేటపుడు, మూడింటిలోనూ మార్పులేని వారి జీవన దృక్పథాలూ, సంఘర్షణలే వ్యక్తమయేటపుడు పునరుక్తి లేకుండా "ఏ" పాటకి ఆపాటే శభాషనేలా రాయడం శాస్త్రి గారి ప్రతిది. ఆకాశంలో ఆశల హరివిల్లు... ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్లు.. శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా... వరసగా ఈ మూడు పాటలూ చదివితే ఆయన చేసిన కత్తిమీద సాము మనకర్ణమౌతుంది. అలాగే ఏ పాత్రకి ఆ పాత్ర స్వభావం, సంస్కారం- ప్రతిఫలించే లాంటి భాషనే రాయడంలో కూడా అద్భుత ప్రతిభ కనపరచారు. రచయిత.
ఇక ముచ్చటగా మూడో ఏడాది మూడవ నందిని సీతారాము శాస్త్రిగారి ఇంటికి మోసుకొచ్చిన పాట- అందెల రవమిది పదము లేదా... ఒక నాట్య కళాకారిణి తవలోని కళాత్మకత జాగృతం కాగా, ధ్యానమగ్నయై నృత్యం చేసినపుడు రవళించే అందెల మధురధ్వని పదములదెలా అవుతుంది? కాదుకదా! అది అంబరమంటిన హృదయానిది! 'అమృతగానమిది పెదవులడా?' ఉనా... అది అమితానందం పొందిన ఎద చేసే సవ్వడి! కళ్లారా ఆమెని తిలకిస్తూ ఆమెలోని మార్పుని గ్రహించి ముగ్ధుడైన చంద్రం సాగిన సాధన సార్థకమందగ యోగబలముగా యాగఫలముగా బ్రతుకు ప్రణవమై మ్రోగుకదా... అంటూ ఆమె వెంట వడుస్తాడు. ఆమె, మువ్వలు ఉరుముల సవ్వడులై మెలికలు మెరుపుల మెలకువలై మేను హర్షవర్ష మేఘమై మేని విసురు వాయువేగమై... పోగా అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగిరంగులై రసఝుద్ధులు జాలు వారేలా సాగే లాస్యలీలని అతడు పులకితుడై తిలకిస్తాడు. శివ పంచాక్షరిని పునర్నిర్వచిస్తాడు. 'భరతమే నిరతము భాగ్యమ'ని ఆమె గ్రహిస్తుంది. కీలకమైన సన్నివేశాన్ని అయిదు నిముషాల పాటలో ఇమిడ్చిన అక్షరశిల్పి దగ్గరకి నంది. నడచి రాకుండా ఎలా ఉంటుంది? ఇంతవరకు సినిమా చరిత్రలో వరసగా మూడేళ్ల పాటు నంది పురస్కారం ఒకే గీత రచయితని వరించినది లేదు.
93 నుంచి 99 వరకు సినీ గీతాలకి ప్రకటించిన నంది పురస్కారాలన్నీ (96, 98లలో ఈ పురస్కారాలు ప్రకటించలేదు) సిరివెన్నెలనే వరించాయి.
1993లో వచ్చిన గాయం సినిమాలో-
సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ-
సుఖాన మనలేని వికాసమెందుకనీ-
నిజాన్ని బలికోరే సమాణమెందుకనీ-
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం...
అంటూ శాస్త్రి గారడిగిన ప్రశ్న జనసామాన్యంలో తరచుగా, తలెత్తే ఆవేదనకి అక్షరరూపమే సన్నివేశానికి రాసిన పాటలో భాగాలే అయినా సమకాలీన సమాజంమీద ఎక్కు పెట్టిన తూటాలు. పాటంటే సంగీతంతో మేళవించబడి, సినిమాలోని దృశ్యమాలిక వల్ల పరిపుష్టమయే గేయమే అయినా శాస్త్రిగారికి సంబంధించినంత వరకు అది స్వయంప్రతిపత్తి గల కావ్యమే!
ఆ తర్వాతి సంవత్సరం, అంటే 1994లో సిరివెన్నెల సీతా రామశాస్త్రిగారికి ఉత్తమ గీతరచయితగా నంది పురస్కారం మాత్రమే కాక కళాసాగర్ పురస్కారం, మనస్విని పురస్కారం కూడా తెచ్చిపెట్టిన పాట చిలుకా ఏ తోడు లేక... శుభలగ్నం సినిమా కోసం రాసినది. పాట ఒక్కటి చదివినా సినిమా కథంతా అర్థమయ్యేంత పస గలిగిన పాట. వివాహబంధం అంటే మూడో మనిషితో పంచుకోలేని అనుబంధమని తెలుసుకోలేక, డబ్బు మీది వ్యామోహంతో తన పసుపుకుంకుమలనే అమ్ముకున్న ఇల్లాలి కథ ఇతివృత్తంగా తీసిన సినిమా శుభలగ్నం.
చిలకా నీతోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక?-
తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక-
మంగళ సూత్రం అంగడి సరుకా, కొనగలవా చేజారాక?-
లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం చేజారాక?
అనే పల్లవి చదివితే రెండు గీతల్లో బాపూజీ చిత్రాన్ని ఆవిష్క రించిన చిత్రకారుడు గుర్తొస్తాడు. సన్నివేశాన్ని తక్కువపదాల్లో వర్ణించాలన్నా, తక్కువ గీతల్లో చిత్రించాలన్నా అనవసరమైన భాగాలన్నిటిని తొలగించాల్సి వస్తుంది. అత్యంత ప్రాధాన్యత గల విషయాన్ని గుర్తించగల నైపుణ్యం అవసరమవు తుంది. ఆ నైపుణ్యం శాస్త్రిగారి సొంతం. ఎందుకంటే ఆయన గీత రచయిత మాత్రమే కాదు. జ్ఞాని, వేదాంతి కూడా.
బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించానే-వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే-అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే-అతితెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే
అని తర్వాతి చరణంలో ఆమె ఎన్నుకున్నమార్గంలోని విషాదాన్ని కళ్లకి కట్టిస్తారిలా-
అనురాగం కొనగలిగే ధనముందా లోకంలో 7-మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో? ఆనందం కొనలేని ధన రాశితో అనాథగా
మిగిలానే అమవసలో-తీరా నువు కను తెరిచాక తీరం కనపడచే ఇంకా-
కురిసే కాసుల జడిలో తడిపి నిరుపేద...
అనడం ఎంత భావగర్భితమైన ప్రయోగం! ఎంతటి ధనరాశు ల మధ్య నిలబడినా ఆప్యాయతా, అమరాగం అందించే సాహచర్యం లేనపుడు ఆ జీవితం వెలుగులేని అమావాశ్య రాత్రే, సొంతమని చెప్పుకునే వాళ్లు లేని అనాథ బతుకే, ఉద్వేగం, ఉద్రేకం నిండిన సన్నివేశం డిమాండ్ చేయనంతవరకు, శాస్త్రిగారి పాటల నిండా లేలేత పూరేకుల్లాంటి పదాలే కనిపిస్తాయి.
1995లో వచ్చిన శ్రీకారం సినిమా కోసం శాస్త్రి గారు రాసిన మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు-
కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరప
అనే పాట సరళ గంభీరంగా కనిపిస్తూనే ఎంతో స్ఫూర్తి వంతమైన సందేశాన్నిస్తుంది. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకి పాల్పడే యువతకి ఒక మేల్కొలుపు లాంటిరీ గీతం. వేటారు. వేళలో పోరాడాలని ప్రబోరిస్తూ, 'తనువే మోదైనా కూలిపోదు తరువేదైనా అని గుర్తుచేస్తారు. 'ఊపిరి పోసే స్త్రీ లయై నెల కూలితే నేలపై ప్రాణముండనని అనునయిస్తారు! రెండో చరణం. లో స్త్రీ తనని అణచిపెట్టే వాడిని కాళీయై ఎలా కాలికి బొక్కాలో చెప్పి. జీవితాన్ని అర్ధంతరంగా ముగించేద్దామను. కున్నపుడు ఆ ఆయువునే ఆయుధంగా వాడి చూడమని రాసిన, ఆయన కలం, కత్తికన్నా వేల రెట్లు పదునైనది కాదని ఎవరస.గలరు? అందుకే మరో నంది ఈశ్వరానుగ్రహమై శాస్త్రిగారిని చేరింది. దీనితో శాస్త్రిగారి రెండో హాట్రిక్ పూర్తయింది.
నక్సలిజం నేపథ్యంగా వచ్చిన సింధూరం సినిమా 1997లో విడుదలయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డ్ని, ఫిలిం ఫేర్ అవార్డుని గెలుచుకుంది. చిత్ర నిర్మాణం పూర్తయి, ఫ్రీవ్యూ చూసి బయటకు వచ్చిన శాస్త్రిగారిలో పెల్లుబికిన కవితావేశం అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా... పాటగా రూపొందిందని వినికిడి.
స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మన రాజ కీయాలలోని కుళ్లు ప్రక్షాళన కాలేదు. నాయకుల దృక్పథాలలో ఆదర్శాలకి చోటు దొరకలేదు. సమూహక్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ- మొత్తం దేశం తగలడు తోందని నిజం తెలుసుకోరే!, తెలిసి భుజం కలిపి రారే!' అని చేసే ఆక్రందన దేశం పట్ల ప్రేమా, ప్రస్తుత పరిస్థితుల పట్ల ఆవేదనా ఉన్న ప్రతి వ్యక్తినీ కదిలిస్తుంది. ఏదో ఒక సానుకూలమైన మార్పుకోసం ప్రయత్నించమని పురికొల్పుతుంది. 'ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం- ఈ చిచ్చుల సింధూరం?' అన్న ప్రశ్న రగిలే జ్వాలై దహిస్తుంది. 'జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! అన్న సంబోధన మనని తూటాలా తాకుతుంది.
యువత పోరుబాట పడితే, ధర్మాగ్రహం చట్టవ్యతిరేకమైతే "తనలో ధైర్యం అడవికి ఇచ్చి. తన ధర్మం చట్టానికి ఇచ్చి, ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలుచుంటే- నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం, ఈ సంద్యా సింధూరం' అన్న వాక్యం చదివితే ఏ సంగీతపు సహకారం లేకపోయినా శరీరం గగుర్పొడుస్తుంది. లోలోపల ఒక దుఃఖం ఘనీభవిస్తుంది. వేకువ వైపా, చీకటిలోకా ఎటు నడిపేవమ్మా, గతి తోడని భారతమా! స్త్చన బు పెట్టినట్టని పిస్తుంది. అపుడు తెచ్చిన అసామాన్యం ఈ రక్తపు సింధూరం' అని చదివితే మనసు కుత్తుక తెగి విలవిల లాడే శాంతి కపోతాన్నిదర్శించక మానదు. 'చూస్తూ ఇంకా నిదురిస్తానా విశాల భారతమా! ఓ విషాద భారతమా! అంటూ సంధించిన రామబాణం లాంటి ఈ పాటకి, 1997లో నంది పురస్కారం అందినపుడు ప్రేక్షకులంతా, శ్రోతలంతా ఆ నిర్ణయంతో సంపూర్ణంగా ఏకీభవించే ఉంటారు.
1999లో వచ్చిన ప్రేమకథ సినిమా కోసం దేవుడు కరుణిస్తాడనీ, వరములు కురిపిస్తాడనీ నమ్మలేదు... అనే పాటకి శాస్త్రిగారు వరసగా అయిదవ నందిని అందుకున్నారు. ఇది ఆయనకి లభించిన నంది పురస్కారాల్లో ఎనిమిదవది. తరువాత 2005లో చక్రం సినిమాకోసం రాసిన జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది... పాటకీ, 2008లో గమ్యం సినిమాకి రాసిన ఎంతవరకు ఎందుకొరకు ఇంతపరుగు అని అడక్కు... అనే పాటకీ మరి రెండు నందుల్ని సొంతం చేసుకున్నారు.
జగమంత కుటుంబం వాది ఏకాకి జీవితం నాది-సంసార సాగరం వాదే సన్యాసం శూన్యం నావే-కవినై కవితనై భార్యనై భర్తవైన మల్లెల దారిలో మంచు ఏడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల-నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ వంటరిపై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్నీ రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని-జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది... అంటూ జలపాతంలా ఉద్భతంగా పొంగి ప్రవహించిన ఈ పాట వింటుంటే మహాకవి శ్రీశ్రీ గుర్తుకురాక మానడు. ఈ పాట, శాస్త్రిగారు తన గురించి తానే రాసుకున్న ఆత్మగీతంలా కని వస్తుంది.
అలాగే ఎంతవరకు ఎండుకొరకు... పాట కూడా శాస్త్రిగారి తాత్వికతనీ, వసుధైక కుటుంబంగా జగమంతా బతకాలనే ఆకారక్షన్ ప్రతిదించిబిస్తుంది. ఎంతవరకు ఎందుకొరకు కాలనే పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు - ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు-అన్న శాస్త్రిగారి సాహిత్యంలో ప్రతి వాక్యమూ తత్త్వసారమే.
'ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసు కోవా?' అనడిగి 'తెలిస్తే ప్రతీచోట విన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా? అన్న వాక్యాన్ని జతచేయడం చూస్తే వారాయణ సూక్తంలోని 'నీలతోయద మధ్యస్థా... పరమాత్మా వ్యవస్థితః' అన్న శ్లోకం గుర్తొస్తుంది. ప్రతి వ్యక్తి హృదయంలోనూ అదే భగవంతుడు కొలువై ఉన్నపుడు మనుషులంతా ఒకటే అవాలి కదా అన్న ఆలోచన కలుగుతుంది.
కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు -
అడగరే ఒక్కొక్క అల పేరు మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు-
పలకరే మనిషి అంటే ఎవరూ సరిగా చూస్తున్నదా నీ మది-
మదిలో మున్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి- వెలుతురు
నీ చూపుల్లో లేదా మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా.... ఇలా వరసగా శాస్త్రిగారి గేయ సాహిత్యాన్ని చదువుతూ పోతుంటే ఆ గాఢతకి కళ్లు తిరుగుతాయి!.
ఈ పాటనే రోజూ వింటూ ఉంటే అదే ఒక వ్యక్తిత్వ వికాస గీతమై మనిషిని తీర్చిదిద్దుతుంది. ఒక స్నేహ సాఖాతృత్వానికి దారితీస్తుంది. ఇంతటి మహోన్నత సాహిత్యం కేవలం పరిమితమై పోబట్టి కదా కిందటి సంవత్సరం సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న గేయ రచయిత బాబ్ డైలాన్లా మన సిరివెన్నెలకూ ఆ పురస్కారం దక్కే అవకాశం లేకుండా పోయింది?
2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మరీ అంతగా... మహా చింతగా... మొహం ముడుచుకోకలా... పాట గమ్మత్తుగా సాగి పెదవులపై నవ్వులు పూయిస్తూనే, హృద యానికొక కొత్త వికాసాన్నందిస్తుంది.
ఎండలను దండిస్తామా? వానలను నిందిస్తామా?
చలిని ఎటో తరిమేస్తామా చీ పామ్మనీ? కస్సుమని కలహిస్తామా ? ఉప్పుదని విలపిస్తామా?
రోజులతో రాజీ పడమా సర్లెమ్మనీ?-
సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం?
పూటకొక పేచీ పెడుతూ ఏ౦ సాధిస్తామంటే
ఏ౦ చెపుతాం?...
ఇంత సరదాగా, సరళంగా నేర్పే వ్యక్తిత్వపారాలెక్కడ దొరుకు తాయి శాస్త్రిగారి సాహిత్యంలో తప్ప? 'మనుషులనిపించే ఋజువు. మమతలను పెంచే ఋతువు... మురసులను తెరిచే హితవు. వందేళ్లయినా వాడని చిరునవ్వు' అంటూ వాడని చిరు నవ్వుకి సులభమైన సూత్రాలు ఎవరందించగలరు శాస్త్రిగారు తప్ప?
ఇలా నందినందుకున్న పాటలతో పాటుగా ఆనతినీయరా హరా, నా పాట పంచామృతం, భం భం బోలే శంఖం మ్రోగెలే, కొంతమంది ఇంటి పేరు కాదుర గాంధీ, ముసుగు వేయొద్దు మనసు మీద, మేఘాలలో చేరిపొమ్మన్నది. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, నువ్వెవరైనా నేనెవరైనా నీ శ్వాసలో దేంత, నీతోన ఆగిన సంగీతం, తరలి రాని తనే వనంతం. ఇన్ ప్రశ్నలు నీవే ఎవరో బదులివ్వరుగా, రంగేళి హోలీ హంగామా 10- ఇలా ఎన్నో ఆణి ముత్యాల మూటల్ని పాటలుగా శాస్త్రిగారు అందించారు. ఇప్పటికి పదకొండు నంది పురస్కారాలతో పాటు, కళాసాగర్, మనస్విని, కిన్నెర, భరతముని, ఆఫ్ఘా, ఫిలిమ్ ఫేర్, బుల్లితెర అవార్డులెన్నో ఆయన్ని వరించాయి.
రామాయణాన్ని మూడుముక్కల్లో చెప్ప మని అడిగిందెవ నాకు తెలీదుగాని, సిరివెన్నెల సీతా రామాయణాన్ని మూడు రోజుల్లో వ్యాసంగా రాసివ్వమని అడిగింది మాత్రం వాసిరెడ్డి నవీన్ గారే. కవిగా ఆయన పది పంక్తుల్లో ఒక పాట రాసిస్తారు గాని ఆయన పాటని విశ్లేషించాలంటే పాటకో పేజీ అయినా కావాలి. అలాంటిది మూడువేల పైచిలుకు పాటలు, శివదర్పణం వంటి ఇంకా ఎన్నో కవితలు వ్యాసాలూ శ్లోకాలూ రాసిన సిరివెన్నెల గురించి ఒక్క వ్యాసరలో ఇమిడ్చే ప్రయత్నం హాస్యాస్పదం. అయినా 'కొండ అర్థమందు..." అన్నట్టు ఒక చిన్న ప్రయత్నం చేశాను. గత మూడేళ్లుగా నంది అవార్డులు ప్రకటించడం జరగలేదుగాని శాస్త్రిగారు ఈ మూడేళ్లలో సృజించిన పాట లెన్నో ఆ పురస్కారానికే వన్నె తగలని ఉన్నాయి. సిరివెన్నెలలో ఆయన పాటల వేణువూదుతుంటే ఆలమందలా వందులెన్నో ఆయన్ని వెతుక్కుంటూ వస్తూనే ఉంటాయి. ఆ గీతామృతం అందుకునే భాగ్యం మనదే.
ఒక గీత రచయితగా తన గీతాలనిండా సురభిళ పద గుచ్చాలను కూర్చినా, ఆహార చంద్రికలను పేర్చినా, ప్రపంచ మంతటా అలముకుంటున్న విద్వేషాన్నీ, ఆశాంతినీ, మానవ జీవితాలలోని కల్లోలాన్నీ తలచి వేదనలో, శోధనలో మునిగిపోయే మానవతావాది శాస్త్రిగారు, విస్తారమైన పదసంపద, ఆవర్గత వాగిరి ఆయన సాత్తు కావడంతో అవకాశం దొరికినపుడల్లా పాఠకులతో, ప్రేక్షకులతో అంతర్జాలం ద్వారా ముఖాముఖిగా ముచ్చటిస్తూ తన కవితాధార తనది మాత్రమే కాదనీ దాన్ని ఆస్వాదించే ప్రతి ''మనిషి' అని చెప్పి తన టార్గెట్ ఆడియెన్స్ని తనదైన ఒక బృందంగా సమకూర్చుకుంటూ, 'మనవి మనం సంస్కరించు కుంటూ, ఈ మాలిన్యాన్ని వదిలించుకుంటూ మరొక మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకుందామని అభ్యర్థించే ఆశావాది. ఇవాల్టి సినీ గీత రచయితల్లో అత్యధిక ప్రాధాన్యతని పొందుతున్న రచయితగా పాఠకులతో ఒక ప్రత్యక్ష బంధాన్ని ఏర్పరచుకుంటూ వారితో సంభాషిస్తూ 'ఇది కాదు జీవించే విధానం, దీన్ని మించిన ఉన్నతమైన మానవ జీవన ప్రమాణాలున్నాయి. అక్కడికి పయ నమై వెళదాం, ఇంతకన్నా సుహృద్భావ సమన్వితమైన సమాజాన్ని నిర్మించుకుందాం' అని ప్రతిపాదించే వైతాళికుడాయన.
సినిమాకి ఎంత జనాకర్షణ ఉన్నా సినిమా పాట సాహిత్యం పట్ల సాహితీవేత్తలూ, కవుల్లో కొంత చులకనభావం కనపడడం పరిపాటి. గేయ రచయితగా ఎంత పేరు సంపాదించుకున్నా కవులుగా తమని నిరూపించుకోవడానికి వారు ఇతర సాహిత్ ప్రక్రియల్లో ప్రయత్నించాల్సి వస్తూ ఉంటుంది. కేవలం సినీగీతాల రచనతోనే ఒక మహోన్నత స్థానాన్ని సంపాదించుకుని, తన ఉనికిని కాపాడుకుంటూ, తను నమ్మిన సిద్ధాంతాల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా తెలుగు సాహిత్యచరిత్రలో ఒక తారాస్థాయికి చేరుకొని అక్కడ దశాబ్దాల తరబడి నిలకడగా నిలబడగలగడం అసాధారణమని చెప్పక తప్పదు.
'కావ్యేషు నాటకం రమ్యం అన్న వాక్యానికి పరిపూర్ణ రూపం సినిమా. అలాంటి సినిమాలో ఒక భాగమైనందుకు ఎప్పుడూ గర్విస్తా'నని చెప్పుకునే సిరివెన్నెల, పాలవీ నీటినీ సులువుగా వేరు చేయగల రాయంచ ప్రచండతాపాన్ని తానందుకుని సిరివెన్నెలని మనకందించగల చందమామ తనను తాను తిట్టుకున్నట్టుగా ఎవరూ తనని తిట్టలేరనీ, తనని తాను మెచ్చుకున్నట్టుగా ఎవరూ తనని మెచ్చుకోలేరనీ చెపుతూ, మనిషిగా ఎదగాలంటే ఎవరిని వారే విమర్శించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని చెప్పే శాస్త్రిగారు నిరంతరం చేసే పని అదే. తనలోని కవిని తాత్వికుడూ, ఆ తాత్వికుణ్ని మనిషి డామినేట్ చేస్తాడని చెప్తూ మనిషితనానికి పెద్దపీట వేసే సిరివెన్నెల వ్యక్తిగా ఎంత ఉన్నతులో ఆయన్నెరిగిన వారందరికీ తెలిసిన విషయమే. దిగజారిన పాత్రల మీద పాటలు రాసేటపుడు కూడా తన విలువలని దిగజారనీయని కవి శాస్త్రి గారు. ఉన్నతమైన తన ప్రమాణాలద్వారా ఆయన సినిమా రంగంలో తన తోటి రచయితలకీ, తన తరవాతి తరాల రచయితలకి మార్గ నిర్దేశనం చేశారంటే అతిశయోక్తి కాదు.
ఒక సందర్భంలో ఆయన చెప్పిన మాటలు తెలుగు భాష పునర్వైభవానికి దారి తీసే మార్గదర్శక సూత్రాలు కూడా. 'పాల పిల్ల కూడా ఊడని పసిప్రాయంలోనే భారత భాగవతాలూ, భగవద్గీత, ప్రాచీన సద్యవాణ్ణ్మయం, దాశరధీ శతకాని శతకాలూ, భర్తృహరి సుభాషితాలు, అమరకోశం, పెద్దబాలశిక్ష- ఇంకా ఇలాంటి వన్నీ కంఠతా పట్టించిన మన తెలుగింటి విద్యాబోధన తరాలు మారుతున్న కొద్దీ ఏ విధంగా 'చిన్న'బోతోందో గమనిస్తే, ఇంట్లో, వీధుల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలా అన్నిచోట్లా మన పిల్లలకి ఎలాంటి మాటతీరు అలవడుతుందో అర్థం చేసుకోగలిగితే, క్రమక్రమంగా గ్రంధ పఠనం, అధ్యయనం, వినడంలాంటి కసరత్తు కరువై, దంతాలూ, జిహ్వా, స్వరతంత్రులూ, అన్నీ సత్తువుడిగి, దివ్యభాషా పీయూషాస్వాదనికి ఆవర్హమై. పలుకులు నత్తినత్తిగా, వంగినంగిగా తయారై ఆంధ్రభాష ఎలాంటి దుర్దశకి లోనైందో గుర్తిస్తే... ఏ సంపదని కోల్పోతున్నామో తెలుస్తుంది. పండితులు, పెద్దలు, భాషావేత్తలు, విజ్ఞలు, కవులూ ఈ పరిస్థితిని ఉపేక్షిస్తున్నారు.
కేవలం నాదం ద్వారానే ప్రాణవాడుల్ని మీటగలిగే సత్తా వున్న ఆంధ్రవాణిలోని వేదతుల్యమైన వాదమహిమని అలక్ష్యం చేయడం ద్వారా మనం, 'భాషకి అందని భావం లేదు' అనే ఐశ్వర్యాన్ని వదులుకుని, ఏ భాషకీ అందనిదే భావం' అని అనుకోవలసిన దారిద్ర్యాన్ని వరిస్తున్నాం. 'అందరికీ అర్థం కావడం అనే లక్ష్యం కోసం, సినిమా పాట రాన్రామా ఓ అరవై డెబ్బె మాటలకి పరి మితమైపోతోంది. 'అర్థం కావడం వేరు, అనుభూతికి అందడం వేరు అని తెలుసుకుంటే పెనో కొన్ని మాటలతోనే నిత్యనైమిత్తిక వ్యవహారాలు నడిచిపోతున్నాయి కదా. ఇంకా అంత విశాలమైన భాషార్ణవం దేనికి? రండి, భాషా సాగరాన్ని ఎండగట్టి ఎడారి చేసేద్దాం అనుకునే విపరీత ధోరణి మానుకుంటే మనకి అర్థం అయేలా మనకి అందుబాటులోకి వచ్చేలా విలువల శిఖరాల్ని తల వంచమనడం కన్నా గొప్ప విషయాల్ని అర్థం చేసుకునే శక్తి మనకి వశమయ్యేలా అభ్యాసం చేద్దాం' అంటూ వెంబోలు సీతారామ శాస్త్రిగారు, అదే... మన సిరివెన్నెల చేసిన సూచన, భాషద్వారా తన సంస్కృతిని పదిలపరచుకోవాలనుకునే తెలుగు జాతికి సరైనదారి చూపే వెలుగు దివ్వె.
వాదశాస్త్రి నాగలక్ష్మి కవి, కథకులు, చిత్రకారిణి రెండు కవితాసంపుటాలు, రెండు కథాసంపుటాలు ప్రచురించారు సంగీతంలోమా అభినివేశం ఉంది. వివాసం హైదరాబాద్
Do you need help? Just Email or call us
© 2023 Telugu Association of North America. All rights reserved.
Design & Developed by Arjunweb