ఘనంగా పితృ దినోత్సవ వేడుకలు
ఘనంగా పితృ దినోత్సవ వేడుకలు
అంతర్జాతీయ కవితల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అంత ర్జాతీయ పితృ దినోత్సవ వేడుకలను అంతర్జాలంలో ఘనంగా నిర్వహించింది. 'ఘనుడు నాన్న త్యాగ ధనుడు నాన్న' అనే అంశంపై తానా నిర్వహించిన ప్రపంచ స్థాయి కవితల పోటీల్లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం జరిగింది.
ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ, "నాన్న త్యాగాలు మరువలేనివని నాన్న కంటే గొప్ప దైవం లేదని నాన్న కేవలం పిల్లల్ని పెంచి ఇంటికే పరిమితమైన పాత్ర కాదని ఆయనది సామాజిక బాధ్యత అని, ఒక గొప్ప బిడ్డను తయారుచేయడం, తద్వారా గొప్ప సమాజాన్ని నిర్మించగలగటం ఘనమైన నాన్న వ్యక్తిత్వంతోనే ముడిపడి ఉంటుం దని, కాబట్టి నాన్న ఉన్నతంగా, ఉత్తమంగా, నీతివం తంగా, ఆదర్శవంతంగా ఉండాలని తద్వారా ఉదాత్త మైన సమాజం ఏర్పడుతుం, "దని అన్నారు. ప్రపంచ స్థాయిలో నాన్న కవితల పోటీలు నిర్వహించినందుకు తానాను ఆయన అభినందించారు. విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ తనికెళ్ల భరణి మాట్లాడుతూ, "నాన్న అనే అంశం పై తానావారు కవితల పోటీలు నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయ కమైన విషయమని తెలుగు భాషకు, సాహిత్యానికి ఈ కార్యక్రమానికి పోషకదాత 'వెన్నం ఫౌండేషన్' చైర్మన్ మురళీ వెన్నంగారికి, సాంకేతిక సహకారం అందించిన బైట్ గ్రాఫ్ స్టుడియో అధినేత ప్రశాంత్ గారికి, ప్రసారం చేసిన 'మన టీవీ' వారికి, 'టీవీ 5 (ఇంటర్నేషనల్)' వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలియజేశారు.
ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డా|| కళాగిత (అమెరికా), కిరణ్ ప్రభ (అమెరికా) వ్యవహరించారని ఆయన తెలియజేశారు.
ప్రథమ బహుమతి (రూ. 10,116) మౌనశ్రీ మల్లిక్, ద్వితీయ బహుమతి (రూ.7,116) జయశ్రీ మువ్వా, తృతీయ బహుమతి (రూ.5,116/) ప్రొ॥ రామా చంద్రమౌళి గెలుచుకొన్నారని తానా పూర్వ అధ్యక్షులు చౌదరి జంపాలగారు అధికారికంగా ప్రకటించారు.
మరిన్ని వివరాలను వేదిక నిర్వాహకులు శ్రీ ప్రసాద్ తోటకూర తెలియజేస్తూ, ముందుగా చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన భారత సైనికులకు తానా చేస్తున్న సేవలను అభినందనీయ,"మని అన్నారు.
తానా అధ్యక్షులు శ్రీ తాళ్లూరి జయశేఖర్ మాట్లాడుతూ, "నాన్న నారికేళం వంటివాడని పైకి కఠినంగా కనపడినా లోపల అనురాగం, అభిమానం అనే తీయని కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఉంటాయని, అటువంటి నాన్న అనుభవాలను, అనుభూతులను అక్షరరూపంగా మలచడానికి, మనసులో నాన్న జ్ఞాపకాలు నిక్షిప్తం చేయటానికి ప్రపంచస్థాయి. కవితల పోటీలు నిర్వహించామని, ఈ పోటీలో ఆస్ట్రేలియా, అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఒమన్, బెహరైన్ వంటి దేశాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిసా, మహారాష్ట్రలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 750 మంది పాల్గొని అద్భుతమైన కవితలు రాశారు. ఆసాధారణమైన స్పందన లభించింది. మా దృష్టిలో నాన్న మీద రాయబడిన ప్రతీ కవితా ఉత్తమ కవితే కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ కనీ ఉత్తమకవే అని, బహుమతి పొందినట్లే అని మేము భావిస్తూ పాల్గొన్న ప్రతీ కవికీ ప్రశంసాపత్రాలను అంద వేస్తున్నా, "మని అన్నారు.
నివాలులర్పిస్తూ... 'నాన్నా నీకు నమస్కారం' కార్య క్రమాన్ని వారి త్యాగనిరతికి అంకితం చేస్తున్నామని అన్నారు.
పోటీల ఫలితాల గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తూ, 23 మందికి 'నాన్న నీకు నమస్కారం' లైవ్ కవిసమ్మేళనంలో పాల్గొని కవితలు చదివే అవకాశం మరియు సర్టిఫికెట్లు లభించాయి. వారు-శ్రీ రాపోలు సీతారామరాజు (సౌతాఫ్రికా), శ్రీ అల్లాల రత్నాకర్ (బెహరైన్), శ్రీమతి కొప్పుల దివ్య ప్రశాంత్ (ఆస్ట్రేలియా), శ్రీ పంతుల కృష్ణ సుమంత్ (ఒమన్), డా॥ సక్త వెంకటమనోహరరాజు (అమెరికా), డా॥ వడ్డేపల్లి కృష్ణ (హైదరాబాద్), శ్రీమతి సి. యమున (హైదరాబాద్), శ్రీ సిరాశ్రీ (హైదరా బాద్), శ్రీమతి మధురాంతకం మంజుల (తమిళ నాడు), శ్రీమతి పుష్పలత (బెంగళూరు), శ్రీ సిద్ధాం తపు ప్రభాకరాచార్యులు (అశ్వారావుపేట), డా॥ అడిగొప్పుల శేషు ( భద్రాద్రి), శ్రీ చలపాక ప్రకాష్ (విజయవాడ), శ్రీమతి రమాదేవి కులకర్ణి (హైదరా బాద్), డా॥ మనోహరరావు ఉమాగాంధీ (విశాఖ పట్నం), శ్రీమతి చంద్రకళ యలవర్తి (అమెరికా), శ్రీ పుప్పాల కృష్ణచంద్రమౌళి (ఒరిస్సా), డా|| ఎమ్. సి.దాస్. (విజయవాడ), శ్రీ బండారి రాజ్కుమార్ (వరంగల్), శ్రీ గూటం స్వామి (రాజమండ్రి), శ్రీమతి గట్టు రాధికామోహన్ (హనుమకొండ), శ్రీ బొడ్డ కుర్మా రావు (విశాఖపట్నం).

మరో 41 మందికి విశిష్ట బహుమతులు (గిఫ్ట్ ప్యాక్లు+సర్టిఫికెట్లు) లభించాయి. మరో 70మందికి ప్రోత్సాహక ప్రశంశాపత్రాలు అందించడం జరిగింది. అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియ జేశారు.
విశిష్ట బహుమతులు వచ్చినవారిని కొంత మందిని ప్రత్యేక ప్రోత్సాహకాలు అనగా లైవ్ కార్య క్రమంలో కవిత చదివే అవకాశం కల్పించడం వలన ఒక్కొక్కరికి రెండు బహుమతులు వచ్చినట్లు భ్రమ కలుగుతుందని అది నిజం కాదని. ఒక కవికి ఒక బహుమతి అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నిరంజన్ శృంగవరపు వందన సమర్పణ చేస్తూ, "ఈ కార్యక్రమం ఇంతటి ఘనంగా జరగటానికి సహకరించిన ప్రీతీ ఒక్కరికీ తానా తరుపున ధన్యవాదాలు." అని అన్నారు.
సమన్వయకర్త శ్రీ చిగురుమళ్ల శ్రీనివాస్, తానా న్యూజెర్సీ కో ఆర్డినేటర్ శ్రీ రాజా కసుకుర్తి, మరెందరో పెద్దలు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్, యుట్యూబ్లో ప్రత్యక్షప్రసారం ద్వారా లక్షలాదిమంది వీక్షించారు. ఈ కార్యక్రమం తెలుగు కవులలో నూతనోత్సాహాన్ని నింపింది. కొన్ని వందలమంది కవులకు ఏకకాలంలో ప్రపంచ వేదికకు పరిచయం అయిన సంతృప్తి లభించింది .